వాలంటీర్ ల నియమించడంలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల


వాలంటీర్ ల నియమించడంలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాల లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలలో గ్రమ వార్డు వాలంటీర్ లను ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 15,335 గ్రమ వార్డు సచివాలయ లకు గానూ 2.66 లక్షల వాలంటీర్లను నియమించడం జరిగింది.

గ్రమాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీరు అదే పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీర్లను నియమించడం జరిగింది.

వాలంటరీ పోస్టులు భర్తీ చెయ్యక పోవటం వలన సంక్షేమ పథకాల అమలులో చాలా జాప్యం జరుగ కుండా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్ పోస్టులు 7218. రూరల్లో 4213, అర్బన్ లో 3005 లను గుర్తించడం జరిగింది.

ప్రతి జిల్లా లోని గ్రమ వార్డు సచివాలయ జాయింట్ కలెక్టర్ వారు రెండు విడతల్లో అనగా ప్రతి నెల 1వ తేదీ నాడు మరియు 16వ తేదీ నాడు వాలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వవలసి ఉంటుంది సంబంధిత ఎంపీడీవోలు మరియు మున్సిపల్ కమిషనర్ వారు ఖాళీల వివరాలను సంబంధిత జాయింట్ కలెక్టర్లకు ఎప్పటికప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. జాయింట్ కలెక్టర్ వారు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయు అధికారం కలిగి ఉంటారు.

మండల / ULB యూనిట్ తీసుకున్నప్పుడు రిజర్వేషన్ కల్పించడానికి సంబంధిత క్యాటగిరి అభ్యర్థులు లేనందువలన భర్తీ జరగడంలేదని తెలియజేయడం జరిగింది.

ప్రభుత్వాలు పైన విషయాలను గమనించి కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది.

  • రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ROR) అనేది ముందు ఉన్నటువంటి విధానం ప్రకారమే ఉంటుంది.
  • మహిళలకు 50% రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా ప్రతి కేటగిరి లోనూ అమలు పరచాలి.
  • మండలం / ULB యూనిట్ గా కాకుండా జిల్లాను యూనిట్ గా తీసుకుని నియామక ప్రక్రయను పూర్తి చేయడం జరుగుతుంది.
  • జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని ఆయా కేటగిరీ అభ్యర్థులు లేనప్పుడు మిగిలిన కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ నియామక ప్రక్రయ జరపనున్నారు.
  • అర్హతలు, అనర్హతలు, విద్యార్హతలు గౌరవ వేతనం, చేయవలసిన పనులు మరియు ఇతర అన్ని విషయాలు ముందుగా ఉన్నటువంటి జీవో ప్రకారమే ఉండును. 
 


 


Comments